Header Banner

అమృత్ భారత్ తో మెరుస్తున్న రైల్వే స్టేషన్! ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!

  Fri May 02, 2025 14:25        Politics

కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేస్టేషన్‌ల రూపురేఖలు మారిపోతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని పలు రైల్వేస్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వేస్టేషన్‌ కొత్త రూపు సంతరించుకుంటోంది. ఆధునికీకరణ పనులతో రాయనపాడు శాటిలైట్ రైల్వేస్టేషన్ మెరిసిపోతోంది. విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో రాయనపాడు రైల్వే్స్టేషన్ ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్‌కు రద్దీని నియంత్రించడానికి రాయనపాడు రైల్వేస్టేషన్‌ను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మే రెండో తేదీ రాయనపాడు రైల్వేస్టేషన్‌‌లో మొదటి దశ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని సమాచారం. రాయనపాడు రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి అయితే ప్రయాణికులు సులభంగా అమరావతిని చేరుకునే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి వెంకటాపాలెం సహా ఇతర రాజధాని గ్రామాలకు సులభంగా చేరుకునేందుకు వీలవుతుంది.

రాయనపాడు రైల్వేస్టేషన్‌లో మెరుగైన భద్రత కల్పించేలా, ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలు కల్పించారు. మరోవైపు రూ.12.13 కోట్ల వ్యయంతో రాయనపాడు శాటిలైట్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాయనపాడు రైల్వేస్టేషన్ పెండింగ్ పనులను ఈ ఏడాది ఆఖరిలోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు రాయనపాడు రైల్వేస్టేషన్‌లో మొత్తం 3 ప్లాట్ ఫామ్‌లు ఉన్నాయి. విజయవాడ జంక్షన్‌కు రాయనపాడు రైల్వే స్టేషన్ కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైల్వేస్టేషన్‌ మీదుగా నిత్య 20 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే సికింద్రాబాద్, నాగ్‌పూర్ నుంచి భువనేశ్వర్, విశాఖపట్నం, కలకత్తా వెళ్లే రైళ్లు రాయనపాడు రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ రైల్వేస్టేషన్ మీద ప్రయాణికుల రద్దీ ఒత్తిడి తగ్గించేందుకు రాయనపాడు రైల్వేస్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. అలాగే విజయవాడ రైల్వేస్టేషన్‌తో సంబంధం లేకుండా కొన్ని రైళ్లను ఈ స్టేషన్ మీదుగా మళ్లించాలని భావిస్తున్నారు. 2025 ఆఖరి కల్లా రాయనపాడు రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం అందిస్తున్న నిధులతో రాయనపాడు రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంల నిర్మాణం, వెయిటింగ్‌ హాల్, స్టేషన్ మాస్టర్ గది, టికెట్ కౌంటర్, ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు, ఫ్లోరింగ్, గ్రీనరీ వంటి పనులు చేపడుతున్నారు.


ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AmritBharat #RailwayDevelopment #RaynapaduStation #PMModi #ModernRailways #AndhraPradesh #Vijayawada #RailwayUpgrade